సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలోనిగడ్డిపల్లి లో తెలంగాణ ప్రగతిశీల హమాలి & మిల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె భారత్ బంద్ సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడులను వ్యతిరేకిస్తూ ఈనెల 16న జరిగే సమ్మెను భారత్ బందును విజయవంతం చేయాలని కార్మికులకు కర్షకులకు పిలుపునిచ్చారు .మోడీ ప్రభుత్వం ప్రైవేటు శక్తులకు కార్పొరేటర్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మిక కర్షక చట్టాలను సవరణ చేస్తూ నాలుగు కోడలుగా మార్చి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బడా బుజ్జీవ బడా భూస్వామ్య అంబానీ ఆదాము టాటా బిర్లాలకు అండగా నిలబడి బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 16వ తేదీన జరగబోయే సమ్మెను భారత్ బందును విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కే రాములు ఎన్ శ్రీను ఎన్ శేఖర్ ఎన్ నరేష్ ఈ నాగయ్య ఎం హుస్సేన్ కే శ్రీను జి గోపయ్య ఎన్ లక్ష్మయ్య ఎస్ కే సైదులు ఆర్ సైదులు ఎస్కే మస్తాన్ పి నారాయణ వి అశోక్ బి రాజు ఎస్ సైదులు ఎస్ నాగయ్య బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin