సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పట్టణ పరిధిలోని 1వ వార్డు బూడిదగడ్డ బస్తీలో ఇంటింటికీ వెళ్ళి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీకి పట్టణ,గ్రామస్థాయిలో మంచి ఆదరణ లభిస్తోందన్నారు.యువకులు,మహిళలు,సీనియర్ సిటీజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.ఇతర పార్టీలోని యువకులు సైతం బీఎస్పీ వైపు చూస్తున్నారని,భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బహుజన రాజ్యం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.కొత్తగూడెం పట్టణంలో పదివేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని,రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం ఉండేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు.జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో సాయి,నాగుల రవికుమార్,మాలోత్ వీరు నాయక్,వంగా రవిశంకర్,అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin