సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో పోలీస్ ప్లాగ్ మార్చ్ కవాతు. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాజకీయ నాయకులకు ఎలక్షన్ లో అందరూ తమ ఓటుని సక్రమ పద్ధతిలో వినియోగించుకోవాలని మరియు సంఘవిద్రోహా చర్యలకు పాల్పడవద్దని ఎటువంటి కేసులలో ఇరుక్కోవద్దని సక్రమ పద్ధతిలో ఎలక్షన్ ఓటింగ్ జరగాలని గ్రామాల్లో ఏ అరాచకాలు జరగవద్దని తెలియజేసి ప్రజలు రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రామాలలో కావాతును నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అసెంబ్లీ నియోజకవర్గ నోడల్ అధికారి ప్పాల్వంచ డిఎస్పి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, అన్నపురెడ్డిపల్లి ఎస్ హెచ్ ఓ sd షాహీన,దమ్మపేట ఎస్సై రవి, చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి, ములకలపల్లి ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, ఎస్సై సందీప్ ఏఎస్ఐ సర్దార్, అంజయ్య కానిస్టేబుల్స్ సీఆర్పీఎఫ్ బలగాలు వీధుల వెంట పోలీస్ కావాత్ లో పాల్గొని తమ విధులను నిర్వహించారు....
-----------------------
Admin