సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : ములుగు మండలం కొత్తూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో మసీదు నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసారని, నగరాల్లో మతకలహాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కులమత బేధాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మసీదులలో దేవాలయాల్లో పూజారులకు వేతనాలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని జుబేర్ పాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మత పెద్దలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin