Sunday, 07 June 2026 10:18:20 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ పాదయాత్ర ... -పల్లె రఘునాథ్ రెడ్డి

Date : 05 November 2022 10:19 AM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, కొండకమర్ల నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టీడీపీ శ్రేణులు కొత్త ఉత్సాహంగా నెలకొంది. గ్రామ గ్రామాన రైతులను పలకరిస్తూ ముందుకు సాగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓబుల్ దేవర చెరువు తహసిల్దార్ శ్రీధర్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలన్నీ నాశనమై రైతులు కన్నీరు పెడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇంత నష్టం జరిగినా కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏ పంట ఎంత మేర దెబ్బతిందో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేయకపోవడం దుర్మార్గమన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండక ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ రెండు ఇచ్చేవారమని పంటల నష్టపోయిన రైతులకు వీటివల్ల ఊరట చేకూరేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఇవ్వడం మానేసిందన్నారు పంట నష్టం కూడా అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ నే కనీసం రాయితీ కింద వ్యవసాయ పరికరాలు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేరుశనగ కాయగూరల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు, ఉద్యానవన పంట రైతులకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :