సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, కొండకమర్ల నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టీడీపీ శ్రేణులు కొత్త ఉత్సాహంగా నెలకొంది. గ్రామ గ్రామాన రైతులను పలకరిస్తూ ముందుకు సాగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓబుల్ దేవర చెరువు తహసిల్దార్ శ్రీధర్ ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలన్నీ నాశనమై రైతులు కన్నీరు పెడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఇంత నష్టం జరిగినా కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏ పంట ఎంత మేర దెబ్బతిందో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేయకపోవడం దుర్మార్గమన్నారు. గతంలో టిడిపి అధికారంలో ఉండక ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ రెండు ఇచ్చేవారమని పంటల నష్టపోయిన రైతులకు వీటివల్ల ఊరట చేకూరేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఇవ్వడం మానేసిందన్నారు పంట నష్టం కూడా అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ నే కనీసం రాయితీ కింద వ్యవసాయ పరికరాలు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేరుశనగ కాయగూరల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేలు, ఉద్యానవన పంట రైతులకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-----------------------
Admin