సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం, పొనుగోడు రామశర్మ అయ్యగారి మృతి బాధాకరమని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం, పొనుగోడు గ్రామానికి చెందిన శివాలయం ప్రధాన అర్చకులు రామ శర్మ అయ్యగారు అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి, ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
-----------------------
Admin