సర్కార్ టీవీ న్యూస్ / తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి : టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంత ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో అరెస్టై 52 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలయ్యారు. చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున చేరుకోవడంతో రాజమండ్రి జైలు వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు బయటకు వచ్చిన అనంతరం తన మనవడు దేవాన్ష్ కు చంద్రబాబు ముద్దుపెట్టుకున్నారు. అనంతరం జైలు దగ్గరకు వచ్చిన కార్యకర్తలకు అభివాదం తెలిపారు.ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. నేటి నుంచి నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఐదు సాధారణ షరతులు విధిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు తీర్పు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, వైద్యుల నివేదికలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల లేఖలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు 15 పేజీల తీర్పులో ప్రస్తావించారు.
-----------------------
Admin