సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి, బంగారం విక్రయాల్లో అవకతవకలపై రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని ముసద్దీలాల్ జువెల్లర్స్ షోరూమ్లను సీజ్ చేసింది.బంగారం విక్రయాల్లో అవకతవకలపై రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల్లోని ముసద్దీలాల్ జువెల్లర్స్ షోరూమ్లను సీజ్ చేసింది.రెండు రోజుల పాటు ఫిజికల్గా తనిఖీలు నిర్వహించిన ఈడీ బృందాలు సుమారు రూ.100 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నది. బినామీల రూపంలో పెట్టిన రూ.50 కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్లను కూడా సీజ్ చేసింది. మెటల్స్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించిన ఈడీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ముసద్దీలాల్, ఎంబీఎస్ జువెల్లరీ షోరూమ్లలో రెండు రోజుల పాటు చేసిన సోదాలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి.సుమారు రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని తమ నుంచి ముసద్దీలాల్ జువెల్లరీ కొనుగోలు చేసిందంటూ ఎంఎంటీసీ గతంలో ఫిర్యాదు చేసింది. బంగారం మొత్తాన్ని విక్రయించినా ఆ డబ్బుల్ని చెల్లించలేదని వాపోయింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కోసం అవకాశంబినామీల రూపంలో పెట్టిన రూ.50 కోట్ల మేర ఇన్వెస్ట్ మెంట్లను కూడా సీజ్ చేసింది. మెటల్స్ అండ్ మినరల్ ట్రేడింగ్ కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ జరిగినట్లు భావించిన ఈడీ రంగంలోకి దిగింది. ఏకకాలంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ముసద్దీలాల్, ఎంబీఎస్ జువెల్లరీ షోరూమ్లలో రెండు రోజుల పాటు చేసిన సోదాలు మంగళవారం మధ్యాహ్నం ముగిశాయి. జువెల్లరీ దుకాణాలకు చెందిన సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్త తదితరులపై గతంలో ఉన్న సీబీఐ కేసులకు అదనంగా ఇప్పుడు ఈడీ కూడా కేసుల్ని నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బోగస్ సేల్స్ చూపించి పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చుకోవడం, ఆ తర్వాత జీఎస్టీ ఎగవేత లాంటి ఆరోపణలు, కేసులు అప్పటి నుంచే ఈ సంస్థపై ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలోనూ రూ. 130 కోట్లను ఈడీ అటాచ్ చేసింది.
-----------------------
Admin