సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,వారికి శాశ్వత పరిష్కారం చూపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి మండల పరిధిలోని రంగాపురం గ్రామంలో పర్యటించి భాదితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లు నీటమునిగి పేద ప్రజలు అపార నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.వర్షాలు బాగా పడినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుందని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారన్నారు.వరద బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూడాలని స్వంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మీ పథకం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,ఇల్లులేని పేద వారికి ఇంటి స్థలాలు మంజూరు చేసి బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు.ప్రతీ కుటుంబానికి నెల రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందించాలని,అంటువ్యాధులు ప్రభలకుండా ప్రతీ గ్రామానికి వైద్య బృందాలను పంపి వైద్యంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,కోలా మల్లికా,ఎర్రంశెట్టి రాజేశ్వరి,బాణోత్ లీలా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin