సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం పాత దొనబండ తండాలోనీ కొంత మంది యువత కొద్ది రోజుల క్రితం వచ్చి రఘు ని కలిసి మా తండాలో పండుగ చేసుకోవడానికి మీ సహకారం కావాలి కానీ మా తండాకి మీరు వచ్చి గ్రామస్థులందరితో ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పడం జరిగింది. వెంటనే రఘు స్పందించి మీకు నేను ఉన్నాను అని చెప్పి వెంటనే పాత దొనబండతండ కి వెళ్లి పెద్దలందరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి నేను మీకు దైర్యం గా ఉండండి అని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం దేవాలయానికి పెయింటింగ్ దాదాపు 5,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి మూడు రోజుల పాటు గ్రామస్థులందరూ వేద మంత్రాల మధ్య నియమ నిష్టతో ఉండి సహకరించిన రఘు ని బారి ర్యాలీగా గ్రామస్థులు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్య క్రమం ప్రారంభించడం జరిగింది. రఘు మాట్లాడుతూ గిరిజనులు అంత నా స్వంత మనుషులు అని నేను మీ పక్క గ్రామం నుండి చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడిని కష్టాలను చూసిన వాడిని మీ పిల్లలు భవిషత్తు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న నాకు అండగా మీరంతా నిలవాలి అని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి కుక్కల వెంకన్న, తండా పెద్దలు, దేవాలయం కమిటి సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin