సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని పల్చర్లకుంట తండా వాసులకు త్రాగునీటి కోసం తము ఇబ్బంది పడుతున్నామని గతంలో తండా కు వెళ్లనా సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ను అడిగారు. అప్పుడు కచ్చితంగా త్రాగు నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నేడు తన సొంత ఖర్చులతో రెండు లక్షల అరవై వేల రూపాయలతో తండావాసులకు వాటర్ ఫిల్టర్ మరియు 70వేల రూపాయలతో వీధి లైట్లు ఏర్పాటు చేసేందుకు తన సొంత ఖర్చులతో ఇచ్చారు. దీంతో గిరిజన వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బాలరాజు గౌడ్, ఫరఖ్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, ఫరూఖ్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, నాగులపల్లి సర్పంచ్ నర్సింలు, తుపాకుల శేఖర్, తండావాసులు రాజు నాయక్, సంజు నాయక్, డాక్య నాయక్, ఎల్ సంతోష్ నాయక్, పి రమేష్, తర్య నాయక్, ఎల్ నరసింహులు, హర్యానాయక్, డాక్య నాయక్, వెంకటేష్, శ్రీహరి నాయక్, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin