సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో జనరల్ బాడీ లో సమావేశంలో ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం)అభ్యర్థి మల్లు లక్ష్మి మాట్లాడుతూ,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని నేడు కమ్యూనిస్టులులేని చట్ట సభలు…విగ్రహాలులేని దేవాలయాలు లాంటిది కాబట్టి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలి ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా కమ్యూనిస్టులు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. రాష్ట్రంలో నిరుద్యోగులు రైతులు విద్యార్థులు మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు, నీళ్లు నిధులు నియామకాల కొరకు ఏర్పడిన రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల తో కట్టిన ప్రాజెక్టు సరైన డిజైన్ ఇంజనీరింగ్ పర్యవేక్షణ లేకపోవడంతో కుంగిపోయిందని ,కేంద్ర నిపుణులు ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని సూచించారు ,లక్షల కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరినారు, నేడు ధన రాజకీయాలు మత రాజకీయాలు నడుస్తున్నాయని ధన మత రాజకీయాలను తిప్పి కొట్టి పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలుపు ఉంచాలని పిలుపునిచ్చినారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు ,పోలిశెట్టి యాదగిరిరావు ,జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి , దుగ్గి బ్రహ్మం, వి .సైదులు, వేల్పుల వెంకన్న ,మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి ,టౌన్ కార్యవర్గ సభ్యులు తుమ్మకొమ్మ యోన ,రేపాకుల మురళి ,నర్సింగ్ లింగమ్మ, సొసైటీ డైరెక్టర్ ఇందిరాల లక్ష్మి ,మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకటచంద్ర ,నూకల లక్ష్మీనరసింహ, చిన్న వీరమల్లు, జక్కుల వెంకటేశ్వర్లు, పాశం వెంకట్ నారాయణ ,తురక వీరయ్య ,చింతకుంట వీరయ్య ,శీలం సాంబయ్య ,జి శీను చందాల భిక్షం ,నెట్టే వెంకటేశ్వర్లు ,అన్నమనేని మాధవరావు, మాటూరి నరసింహ ,చారి ,బొమ్మగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin