సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాద్ నగర్ పట్టణ బీజేవైఎం మాజీ అధ్యక్షులు క్యామ మహేష్ మరియు అయోధ్య శ్రీనివాస్, దేవేందర్ తదితరులు స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అధికార పార్టీ చేస్తున్న ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. పార్టీలో చేరినవారు.. క్యామ మహేష్, అయోధ్య శ్రీనివాస్, దేవేందర్, ప్రవీణ్, అభి, కృష్ణ, సత్యనారాయణ, యాది, శేఖర్, కె. ప్రవీణ్, శ్రీనాథ్, ఓంకార్, పి. నరేష్, రాఘవేందర్, రమేష్, కె. శ్రీను, మల్లేష్ తదితరులు..
-----------------------
Admin