సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఆదివాసీల ఆరాధ్య వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను మేడారం జాతర సందర్భంగా దర్శనం చేసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు,వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పూలమాలలు సమర్పించి, రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు.అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ,సమ్మక్క–సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని,ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ మహోత్సవం తెలంగాణ గర్వకారణమని తెలిపారు.గిరిజనుల ఆరాధ్య వనదేవతల ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు
-----------------------
Reporter