సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ధన్వాడ ఉన్నత పాఠశాలలో పాఠశాల సముదాయ సమావేశం జరిగింది. ఈ సముదాయానికి ధన్వాడ, మరికల్,నర్వలకు చెందిన తెలుగు భాషాపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భోజన విరామ సమయంలో పండిత పీఈటీలను అప్గ్రేడ్ చేయాలని భాషాపాధ్యాయులు అకాడమిక్ మానిటరింగ్ అధికారి, శ్రీ విద్యాసాగర్ గారికి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రమేష్ గారికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పండిత పరిషత్తు జిల్లా సలహాదారు ఇబ్రహీంబాద్ లక్ష్మణ్ మాట్లాడుతూ...... రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న, భాషాపండితులు మరియు పీఈటీలు,ఏళ్ల సంవత్సరాలుగా ఉన్నత స్థాయి తరగతులు భోదిస్తున్నప్పటికి,గ్రేడ్ 2 గానే పరిగణిస్తున్నారు.జాబ్ చాట్ ప్రకారం అయితే గ్రేడ్ 2 పండితులు 9,10 తరగతులు బోధించనవసరం లేకపోయినప్పటికీ,అన్ని పాఠశాలల్లోనూ తప్పనిసరి పరిస్థితుల్లో 9,10 తరగతులకు కూడా భోదిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పండిత పీఈటీ లు, అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది.ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా స్వయానా గౌరవ ముఖ్యమంత్రివర్యులే అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించిప్పటికి,అది జరగలేదు. పండిత పీఈటీలు ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు వేడుకున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు.ఏదో ఒక దాటవేత ధోరణితో ఈ అప్గ్రేడేషన్ సమస్యను సాగదీస్తూ వస్తున్నది. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 వ తేదీ నుండి అన్ని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న పండిత పీఈటీ లు 9,10 తరగతులకు భోదించకుండా నిరసనను వ్యక్తపరుస్తున్నారు.దాదాపు 15 రోజులుగా 9,10 తరగతులు విద్యార్థులు చాలా నష్టపోతున్నారు.ప్రస్తుత పరిస్థితిలో 10 తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో,ప్రభుత్వం స్పందించకపోతే వేలాదిమంది విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.కాబట్టి, ప్రభుత్వం చొరవ తీసుకొని,అప్గ్రేడేషన్ చేయాలని లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్పన,సరస్వతీ, కృష్ణయ్య,బాలయ్య,నాగేష్,శ్రీనివాస్,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin