సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మండలంలోని లక్ష్మీపురం శివారులో చోటు చేసుకున్న వివాహిత హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం. ఈ కేసులో మృతురాలికి సన్నిహితంగా ఉన్న వ్యక్తినే పోలీసులు ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండొచ్చు అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్ల పెళ్లి సుమలత హత్య కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన ఆధారాలు కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా కేసును చేదించినట్లు తెలుస్తుంది. మృతురాలు ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కావడంతో కేసులో ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అంశాలపై పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన సంబంధిత అధికారుల నివేదిక కోసం ఎదురు చేస్తున్నట్లు తెలుస్తుంది. నివేదిక అందిన వెంటనే అట్రాసిటీ సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రధాన నిందితుడిని నేడో రేపో కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది
-----------------------
Reporter