సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరులోని సింగరేణి ఇల్లందు క్లబ్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ ఈ రోజు అనగా 21-02-2023 జిల్లాలోని పోలీసు అధికారులందరితో ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ మణుగూరులోని సింగరేణికి చెందిన ఇల్లందు క్లబ్ నందు నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ,వారికి న్యాయం చేకూర్చే విధంగా భరోసా కల్పించాలని అన్నారు.బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి,విచారణ చేపట్టి అట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేసారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక వ్యక్తులు రౌడీ షీటర్ల కదలికలను నిత్యం గమనిస్తూ, వారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్లూకోల్ట్స్,పెట్రోలింగ్ వాహనాలను అన్ని ప్రాంతాల్లో తిరిగేలా చూడాలని కోరారు.నేర ఛేదన,నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.మహిళలు,విద్యార్థినులకు షీ టీమ్స్ ఆవశ్యకతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.గంజాయి,గట్క,బెట్టింగులు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్టికల్స్ వారీగా అధికారులు,సిబ్బంది తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని తెలియజేశారు.
-----------------------
Admin