Wednesday, 29 July 2026 01:44:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాస్వామ్యాన్ని పరిహాసిస్తున్న బి జె పి...!

Date : 13 June 2023 12:23 AM Views : 285

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రజాస్వామ్యాన్ని పరిహాసిస్తున్న బిజెపిని సాగనంపెందుకు దేశములోని యువత ముందుకు రావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. ఆయన పాలకవీడు మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ సభ్యుల తో కలిసి పాత్రికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, ముందుకు రావాలని, ప్రజల సొమ్మును అంబానీ అదానీల పాలు చేస్తూ పెట్రోలు, డీజీల్ ,గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, పౌర హక్కులను కాలరాస్తూ సిబిఐ, ఈడీలను, స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించాలని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న దళిత బహుజన మైనారిటీ ఆదివాసి మైనారిటీ వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న మోడీ, అమిత్ షా,లను ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.విద్యా వైద్యం ఉపాధి హక్కుల సాధనకై ఉద్యమించాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని గత శాసనసభ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇస్తామన్నా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెల్లించాలని,1998,2004 సంవత్సరాలలో డీఎస్సీ లో క్వాలిఫై అయిన వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు, శ్రీను, ,సాయి గౌడ్,, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :