సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ , వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఘనంగా నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం మరియు కంటి పరీక్ష శిబిరలు ఏర్పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు నర్సంపేట పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు,వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్ నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదాన మరియు కంటి పరీక్ష శిబిరలను ప్రారంభించారు…ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..దేశానికి దిశా నిర్దేశం చేసి, అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్న మహానాయకుడు నరేంద్ర మోదీ అన్నారు.దేశ అభ్యున్నతికి,వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నరేంద్ర మోదీ నాయకత్వం విశేషమైనది. “సబ్కా సాథ్ – సబ్కా వికాస్” అనే స్ఫూర్తితో ప్రతి వర్గానికీ మోదీ పాలన చేరువైంది.నియోజకవర్గ యువత భారీగా రక్తదానం చెయ్యడానికి ముందుకు వచ్చారు మరియు యువత వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహా రాములు,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్లా రాంచందర్,గంగిడి మహేందర్ రెడ్డి,దుంకదువ్వ రంజిత్,నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,దుగ్గొండి మండల అధ్యక్షులు నెదురు రాజేందర్,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్,ఖానాపురం మండల అధ్యక్షులు రాధారపు అశోక్,చెన్నారావుపేట మండల అధ్యక్షులు దామరప్పుల శేఖర్,సీనియర్ నాయకులు కునమల్లా పృథ్వి,వనపర్తి మల్లయ్య, బిజే వైఎం జిల్లా నాయకులు ఎర్రగొల్ల భరత్ వీర్,అచ్చ దయాకర్,జూలూరి మనీష్, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter