సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన నర్సంపేట నియోజకవర్గ రాడ్ బెండింగ్ సంఘం అధ్యక్షుడు కట్యాల రవి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి* సమక్షంలో బీజేపీలోకి చేరిన 40 కుటుంబాలు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతు బి.ఆర్.ఎస్ 10 సంవత్సరాల పాలనలో దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్, ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడికి పోయినాయి బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని మీము ప్రజా పాలన అందిస్తామని 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాడు పథకాల అమలులో విఫలమై మరియు ఇచ్చిన మాటలను గాలికి వదిలేసి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి అని ఉన్న రోడ్ల మీద రోడ్లు పోసి రోడ్లు లేని దగ్గర గాలికి వదిలేసి పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బిజెపి సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, కుంభం కోమల్ రెడ్డి, జూలూరి మనీష్ గౌడ్, శీలం సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు గంగిడి మహేందర్ రెడ్డి, పొదిళ్ల రామచందర్, యువ మోర్చ జిల్లా జనరల్ సెక్రటరీ అచ్చ దయాకర్, యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ కోమండ్ల సప్తగిరి, యువ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు పల్లంకొండ శ్రీను, పోనుగోటి రవీంద్ర చారి, నూనె రంజిత్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, రూరల్ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాము, పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కార్యదర్శులు చేను నరేష్, అశోక్, బొంతరబోయిన రమేష్, యువమోర్చా నాయకులు తప్పెట్ల సతీష్, మరియు జిల్లా నాయకులు పట్టణ నాయకులు యువమోర్చా నాయకులు బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter