సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్. షాద్ నగర్ మున్సిపాలిటీ 15వ వార్డు లో కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మూర్తి, సురేందర్ మరికొంతమంది కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా షాద్ నగర్ మున్సిపాలిటీ 15 వ వార్డు కు చెందిన సుమారు 60మంది కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, స్థానిక కౌన్సిలర్ లు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టవంతంగా మార్చడానికి కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో లేనివిధంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలతో కలకలలాడుతుందని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పార్టీ చేరికల కోసం క్యూ కట్టబోతున్నారని అన్నారు.
-----------------------
Admin