సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలంలోని చాపల మార్కెట్ ఏరియా నందుగల సత్య భాస్కర అండ్ మాంటిసోరి స్కూల్ నందు ఆన్యువల్ స్పోర్ట్స్ & ఆర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సోమవారం హాజరయ్యారు ప్రారంభించారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు, తధానంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి ఎదగాలని మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ ప్రాంతంలో ఉన్నత విద్య ప్రమాణాలు అందిస్తూ మారుమూల ప్రాంతంలో అత్యుత్తమ విద్యార్థులను తయారు చేస్తున్న విద్యాసంస్థల సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తదితర అంశాలు కూడా పాల్గొని రాణించాలన్నారు.
-----------------------
Admin