సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లను కలిసిన రేవంత్ రెడ్డి.. కొద్దిసేపటిక్రితం సోనియా గాంధీ కలిశారు. ఈ సందర్భంగా రేపు తన ప్రమాణస్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాద పూర్వకంగా కలిసి ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగనుంది. గవర్నర్ తమిళిసై రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉందన్నారు....
-----------------------
Admin