సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు తో పాటు పదోన్నతులు ఇస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి శేరిలింగంపల్లి కంటెస్టేడ్ ఎం. ఎల్.ఎ, మారబోయిన రవి కుమార్ యాదవ్ తెలిపారు.రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ శేరిగంపల్లి నియోజకవర్గం పెద్దలు నాకు బాధ్యతాయుతమైన పదవి అప్పగించేందుకు సహకరించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.నేను ఈ బాధ్యతను నిజాయితీ క్రమశిక్షణతో నిర్వహిస్తానని అందరిని కలుపుకొని పార్టీ ప్రతిష్టను కాపాడుతూ పార్టీ క్యాడర్ కు మార్గనిర్దేశం చేస్తూ వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ఎం రవి కుమార్ యాదవ్ నాయకత్వంలో పార్టీ విజయానికి బలమైన పునాది వేస్తానని అందుకు నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం కావాలని కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Reporter