సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్ లో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై బిజెపి కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చినంక 100 రోజులలో అమలు చేస్తానని ఇచ్చిన మాటను ఈ పార్లమెంటు సమావేశాలలో మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్య రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు.వారు కూడా స్పందించి రాష్ట్ర సమావేశాలలో కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతానని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎంఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి ప్రసాద్ మాదిగ హుజూర్ నగర్ మండల అధ్యక్షులు మాదాసు గోపి మాదిగ మేళ్లచెరువు మండల అధ్యక్షులు బండారు వీరబాబు మాదిగ చింతలపాలెం మండల కన్వీనర్ రుద్రపంగు రమేష్ మాదిగ ,మహేష్ మాదిగలు కలిసినారు
-----------------------
Admin