సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ :మిర్యాలగూడ ఆర్గనైజేషన్ సంస్థ చైర్మన్ మన్యం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ పార్క్ హైస్కూల్లో బాలికల కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో మొత్తం 25 జట్లు పాల్గొనగా నాలుగు జట్లు విజేతగా నిలిచాయి అని పి ఈ టి కిరణ్ తెలిపారు ఇందులో మొదటి బహుమతి గా జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ హైస్కూల్ 25 వేల నగదు తో పాటు షీల్డ్ కూడా ప్రధానం చేశారు రెండో బహుమతి జడ్పిహెచ్ఎస్ యాదగిరి పల్లి 15000 నగదు షీల్డ్ కూడా అందజేశారు మూడో బహుమతి జడ్.పి.హెచ్.ఎస్ షాపు నగర్ పదివేల నగదు తో పాటు షీల్డ్ కూడా ప్రధానం చేశారు నాలుగో బహుమతి గాంధీ పార్క్ స్కూల్ ఐదువేల నగదు తో పాటు సీలు కూడా ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కురువ నాయక్ పీఈటీలు మనోహరి వెంకటరత్నం ఇందిరా కిరణ్ తోపాటు మిర్యాలగూడ ఆర్గనైజర్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
-----------------------
Admin