సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలం శూన్య పాడు గ్రామంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా భగత్ సింగ్ యూత్ పిల్లుట్ల రఘు ని ఆహ్వానించడం జరిగింది. రఘు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు . ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుక్కల వెంకన్న మాట్లాడుతూ భగత్ సింగ్ చేసిన పోరాట స్ఫూర్తిని వారి కీర్తిని ప్రసంగించారు. స్వతంత్రం నా జన్మ హక్కు అని పోరాడిన వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాలకీడు మండల ఇంచార్జ్ గంగరాజు యాదవ్ ,సైదిరెడ్డి ,నరసయ్య నాక్కని నరేష్, భాస్కర్, అంజి, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin