సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ కొత్తగూడెం పట్టణంలోని మత పెద్దలందరితో పీస్ కమిటీ సమావేశాన్నిశనివారం ఏర్పాటు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. కొత్తగూడెం పట్టణ, పరిసర ప్రాంతాలకు గణేష్ ఉత్సవ కమిటీలు ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పోలీసు వారు సూచించే నేమి నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దల వద్ద నుండి సలహాలు,సూచనలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్,వన్ టౌన్ సిఐ కరుణాకర్,టూ టౌన్ సిఐ రమేష్,3 టౌన్ సిఐ మురళి మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin