సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం పంచాయతీ, చొక్కాల గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కూలినాలి చేసుకొని జీవనం సాగిస్తున్న మచ్చా రవితేజ, సోదరుడు రాంబాబు వారి కుటుంబ సభ్యులంతా కూలి పనుల నిమిత్తం వెళ్లారు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై, ఇంట్లో ఉన్న వంట గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను బయట పడేశారు. వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం తో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామ యువకులు,ప్రజలు మంటలను అదుపులో తీసుకొచ్చారు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ పేద కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. ప్రభుత్వపరంగా తమ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని అగ్ని బాధితులు, గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
-----------------------
Admin