సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి చేయడం సిగ్గుచేటని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రముఖ న్యాయవాది హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామ్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనుచరులు దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక మూకల తో దాడి చేయించారని ఆరోపించారు. టిడిపి నేతలు ఎన్ని కుయుక్తులు పన్నిన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చేతగాని దద్దమ్మలు టిడిపి నాయకులు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక టిడిపి కార్యకర్తల చేత దాడి చేయించి గాయపరుస్తున్నారని విమర్శించారు. ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిపినాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని అన్నారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి చంద్రబాబు హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin