Wednesday, 29 July 2026 02:59:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదు....

Date : 25 July 2023 08:31 AM Views : 483

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మాయ చేస్తున్నారని గజ్వేల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ముఖ్యమంత్రి హోదాలో గజ్వేల్ మున్సిపాలిటీకి ఐదువేల డబుల్ బెడ్ రూములు ఇస్తానని ఇచ్చిన హామీ 9 ఏండ్లయినా నెరవేర్చలేదని పెద్ద పెద్ద బంగ్లాలు రోడ్లు నిర్మిస్తే సామాన్య ప్రజలు అభివృద్ధి జరిగినట్ట అని ఆయన ప్రశ్నించారు.. తన మాయమాటలతో రెండు సార్లు మోసం చేసిన కేసీఆర్ మూడవసారి మోసపోయే స్థితిలో గజ్వేల్ ప్రజలు లేరని వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలే సీఎం కేసీఆర్ ను ఓడిస్తారని, జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అంతర్గత మురుగు కాలువలు సిసి రోడ్లు లేక మున్సిపాలిటీలో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ఇంద్ర పార్క్ నుండి కోట మైసమ్మ వరకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోవడంలేదని నక్క రాములు గౌడ్ అన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :