సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మాయ చేస్తున్నారని గజ్వేల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ముఖ్యమంత్రి హోదాలో గజ్వేల్ మున్సిపాలిటీకి ఐదువేల డబుల్ బెడ్ రూములు ఇస్తానని ఇచ్చిన హామీ 9 ఏండ్లయినా నెరవేర్చలేదని పెద్ద పెద్ద బంగ్లాలు రోడ్లు నిర్మిస్తే సామాన్య ప్రజలు అభివృద్ధి జరిగినట్ట అని ఆయన ప్రశ్నించారు.. తన మాయమాటలతో రెండు సార్లు మోసం చేసిన కేసీఆర్ మూడవసారి మోసపోయే స్థితిలో గజ్వేల్ ప్రజలు లేరని వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలే సీఎం కేసీఆర్ ను ఓడిస్తారని, జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అంతర్గత మురుగు కాలువలు సిసి రోడ్లు లేక మున్సిపాలిటీలో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ఇంద్ర పార్క్ నుండి కోట మైసమ్మ వరకు ఏర్పాటు చేయాల్సిన రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోవడంలేదని నక్క రాములు గౌడ్ అన్నారు..
-----------------------
Admin