సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని ఫరూఖ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రోగ్రాం సడన్ విసిట్ చేశారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఉదయం నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ పరిశీలించి రిజిస్ట్రేషన్ చాలా తక్కువగా ఉన్నాయని, కన్సల్ట్ సూపర్వైజర్ అమృత హెచ్చరించారు. పి.పి యూనిట్ ఏరియాకి సంబంధించిన ఆషాలందరినీ వెంటనే హౌస్ టు హౌస్ కు పంపించి, 18 సంవత్సరముల నిండిన వారి అందర్నీ పిలిపించి కంటి పరీక్షలు చేయించాలని తెలియజేశారు. ప్రతిరోజు అర్బన్ లో మినిమం 200 మందికి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అలాగే ఎవరికైతే దగ్గర చూపు మందగించిన ప్రతి ఒక్కరికి కూడా కంటి అద్దాలు వెంటనే అందజేయాలని తెలియజేశారు. దూరపు చూపు, దగ్గర చూపు ఉన్న వారందరికీ పరీక్ష నిర్వహించి, ప్రిన్క్రిప్షన్ గ్లాసెస్ కు ఆర్డర్ చేయాలని తెలియజేశారు. కంటి చూపు పూర్తిగా మందగించిన వారికి ఆపరేషన్ నిమిత్తము సరోజినీ దేవి ఆసుపత్రికి రిఫర్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి, డాక్టర్ జె ప్రకాష్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ అమృత, ఆప్తమాలజిస్ట్ తుకారం, డి ఈ ఓ అశ్విని, భారతి, ఏఎన్ఎం స్వప్న, ఆశలు పాల్గొన్నారు.
-----------------------
Admin