సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలేరు జలాశయం నింపడానికి ఎన్నెస్పీ నీటి విడుదల... త్రాగునీటి వినియోగం కొరకు మాత్రమే వినియోగించుకోవాలని విజ్ఞప్తి... త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. బుధవారం పెన్ పహాడ్ మండలంలోని ఎన్ అన్నారం బ్రిడ్జి వద్ద ఎన్నెస్పీ కెనాల్ ను అదనపు ఎస్పీ మేకల నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు నాగార్జున సాగర్ జలాశయం నుండి పాలేరు జలాశయం నింపడానికి మంగళవారం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. త్రాగు నీటి కొరకు కాకుండా ఇతర అవసరాల వినియోగం చేయకుండా 26 టీం లను ఏర్పాటు చేసి 126మంది సిబ్బందిని 24గంటలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం త్రాగునీటి కొరకు మాత్రమే నీటిని విడుదల చేసిందని రైతులు బోర్లా ద్వారా నీటిని వినియోగించవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పెన్ పహాడ్ పరిసర ప్రాంతాలలో బోర్లా వినియోగం చేయకుండా బోర్లకు కరెంట్ కనెక్షన్స్ తొలగించడం జరిగిందని బుధవారం సాయంత్రం యధావిధిగా కరెంట్ కనెక్షన్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నెస్పీ నీరు పాలేరు జలాశయం చేరితే సూర్యాపేట జిల్లాలో మరో మూడు నెలల పాటు 393 అవాసలు, 192 గ్రామ పంచాయతీ లకు, రెండు మున్సిపాలిటీ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా త్రాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు..
-----------------------
Admin