Thursday, 30 July 2026 03:04:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇళ్ళ స్థలాల అవకతవకలపై విచారణ జరిపించాలి... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్

Date : 27 September 2023 07:58 AM Views : 302

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామవరం : పట్టణ పరిధిలో ఇళ్ళ స్థలాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి నాగయ్య గడ్డలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ లో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని,స్థానిక కౌన్సిలర్లు ఒక్కొక్కరి వద్ద రూ.30 నుండి రూ.50 వేల వరకు వసూలు చేసి సొంత ఇల్లు ఉన్నవారికి,మున్సిపల్ పరిధిలో కాకుండా పక్క మండలంలో,పక్క జిల్లాలో ఉంటున్న వారికి,ఒక వార్డులో ఉంటున్న వారికి ఇంకో వార్డులో మంజూరు అయ్యేలా చేశారని ఆరోపించారు.ఇంటి పట్టాల కోసం జరగాల్సిన ఎంపిక ప్రక్రియ అలా కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన వారినే అర్హుల జాబితాలో ప్రకటించారని ఆరోపించారు.అధికారులు విచారణ జరిపి ఇళ్ళు లేని పేదలకు,ఎన్నో ఏళ్ళుగా కిరాయి ఇళ్ళలో నివాసం ఉండే నిరుపేదలకు న్యాయం చేయాలని,ఇంటి స్థలాల కోసం డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,చుంచుపల్లి మండల అధ్యక్షుడు నాని,పట్టణ ప్రధాన కార్యదర్శి సిద్దంకి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :