సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ బాద రామన్నకు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి మేకల కనకారావు పాల్గొని మాట్లాడుతూ కామ్రేడ్ రామన్న తన చిన్నతనం నుండే విప్లవ రాజకీయాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల్లోనే పి డి ఎస్ యు లో పనిచేస్తూ విద్యార్థుల సమస్యల పట్ల అనేక ఉద్యమాలు నిర్వహిస్తునే అంచలంచెలుగా ఎదుగుతూ సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తూన్న క్రమంలో పార్టీ పనిమీద కోదాడ వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. కామ్రేడ్ రామన్న .చనిపోయి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తయినసందర్భంగా కామ్రేడ్ రామన్నకు విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కమల నవీన్ కామల్ల శ్రీను అరుణోదయ జిల్లా కమిటీ సభ్యులు గండు నాగేశ్వరరావు గ్రామ మాజీ సర్పంచ్ మహాశక్తి అంజయ్య సీనియర్ నాయకులు కామ్రేడ్ తాళ్లూరు సూర్యం చెనగాని పెద్ద సాంబయ్య చనగాని లక్ష్మయ్య వల్లపుదాసు లచ్చయ్య జిలకర ముత్తయ్య కొమురయ్య చింతమళ్ళ అంజయ్య ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకులు కామ్రేడ్ వల్లపు దాసు సంతోష సువార్త మల్లమ్మ నరసమ్మ రుతమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin