సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జిల్లా బందోబస్తు విధులు నిమిత్తం పారామిలిటరీ బలగాలు జిల్లాకు రావడం జరిగినది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వర్తించనున్న కేంద్ర బలగాల సిబ్బందికి తిరుమలగిరి మండల కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల నందు వసతి ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ వారి వసతి, సదుపాయాలను పరిశీలించి ఎలాంటి సమస్య ఉన్న నేరుగా సప్రదించాలని తెలిపినారు. కేంద్ర బలగాల సిబ్బంది, అధికారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని సంభందిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డి ఎస్ పి నాగభూషణం, సి ఐ శివ శంకర్, ఎస్ ఐ లు ప్రసాద్, సైదులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పి ముఖ్యమంత్రి .చంద్రశేఖర్ రావు తిరుమలగిరి మండల కేంద్రంలో పర్యటన సందర్భంగా బహిరంగ సభ వద్ద భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాలు పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ సిబ్బంది సూచనలు చేసి ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా పని చేయాలని, ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్దరణ, వాహనాల మల్లిపుంపు, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాల నిలిపివేత లాంటి అనేక అమశాల పై సిబ్బందికి సూచనలు చేసినారు. బందోబస్తు నందు అదనపు ఎస్పి, 5 గురు డి ఎస్ పి లు, 10 మంది ఇన్స్పెక్టర్ లు, 42 మంది ఎస్ ఐ లు మొత్తం 400 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు.
-----------------------
Admin