సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఒకానొక సమయంలో సహాయం చేసిన వారిని మర్చిపోవచ్చేమో కానీ..., ఎవ్వరు సహాయం చేయలేనప్పుడు సహాయం చేసిన వాళ్ళని మాత్రం మనసు ఎప్పుడు మరచిపోదు.. కొత్తగూడెంలోని రాంనగర్ కాలనీలో నివసిస్తున్న దాసరపు పోచమ్మ అనే మహిళకు కళ్ళు సరిగ్గా కనిపించకపోవడంతో కంటి నొప్పితో గత కొన్ని రోజులుగా చాలా బాధపడుతుంది. ఈ మేరకు వాళ్లు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళగా ప్రైవేటు ఆసుపత్రి వాళ్ళు ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు అయితాయి అని తెలిపారు. ఈ నిరుపేద కుటుంబానికి ఏం చేయాలో అర్థంకాలేదు.వాళ్ల దగ్గర అంత స్తోమత లేకపోయింది. అనేక అవస్థలు పడినారు. దిక్కుతోచని పరిస్థితులలో కొత్తగూడెం యువ నాయకుడు కిరణ్ ని కలిసి వారి సమస్యను తెలియజేశారు. అయితే కిరణ్ వెళ్లి Dr. జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగ వారిని అక్కున చేర్చుకున్న Dr. జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు హైదరాబాద్ లోని Dr. అక్బర్ సూపర్ స్పెషలిటీ కంటి ఆసుపత్రి లో జాయిన్ చేయించి, ఉచితంగా ఆపరేషన్ చేయించి సక్సెస్ఫుల్గా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. మా పాలిట దేవుడైన నిలిచిన, మానవతామూర్తి మంచి మనిషి డా. గడల శ్రీనివాస్ రావుకి జీవితాంతం రుణపడి ఉంటాము అని దాసరపు పోచమ్మ కుటుంబ సభ్యులు డా. గడల శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సమస్యను తెలుసుకుని వెంటనే స్పందించిన కొత్తగూడెం యువ నాయకుడు కిరణ్ కి ధన్యవాదాలు తెలిపారు.
-----------------------
Admin