సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలం లోని పోనుగోడు,మర్రికుంట, గడ్డిపల్లి, కుతుబ్ షా పురం, గ్రామాల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శ్రీలత కి స్వాగతం పలికారు.పొనుగోడు లో రామాలయం గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.మహిళల నుండి అపూర్వ స్పందన వచ్చింది. శ్రీలతక్క కి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత మాట్లాడారు. - దేశంలో అభివృద్ధి మోడీ వల్లే సాధ్యం అవుతుంది - రాష్ట్రాన్ని కేసిఆర్ కుటుంబం దోచుకున్నది.మిషన్ భగీరథ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసింది కెసీఆర్ కుటుంబం. - గ్రామాల్లో భగీరథ నీళ్లు రావడం లేదు.గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేదు - గ్రామంలో వీధి ఒక బెల్ట్ షాప్ పెట్టీ ప్రజలను దోచుకోవడం కాకుండా ఆరోగ్యాలను కొల్లగొడుతున్నారు. - ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లకు అవకాశం ఇచ్చారు.అయిన అభివృద్ధి చేయలేదు. - ఈ సారి ఒక్కసారి బిజెపి కి అవకాశం ఇవ్వండి.దేశంలో మోడీ,రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే అభివృద్ధి దూసుకుపోతుంది. - కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మీ ఆడబిడ్డ ను గెలిపించండని కోరారు. - ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షులు నర్సింగ్ అంజయ్య, ఒబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర్లు,మండల ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin