సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి పాలు పట్టించాలి అని అంగన్వాడీ టీచర్ వసుంధర అన్నారు. జాన్ పహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,ముర్రుపాలు బిడ్డకు పట్టించడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనీ,తల్లిపాల వలన బిడ్డకు మెదడు చురుకుగా పనిచేస్తుందనీ, బిడ్డకు తప్పనిసరిగా తల్లి పాలు పట్టించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శిరీష,అంగన్వాడీ టీచర్ లు నిర్మల, శైలజ ,జ్యోతి, ఆశాలు ధనలక్ష్మీ,జానకమ్మ, ఆయ మరియమ్మ,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin