సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం కావాల్సిన భగవాన్ సత్య సాయి 97వ జయంతి ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి డా పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా జరుగుతున్న భగవాన్ సత్యసాయి బాబా వారి జయంతి వేడుకలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేయవలసింది పోయి మొక్కుబడి సమీక్షా సమావేశంతో మమ అనిపించారు. పుట్టపర్తి నగర వ్యాప్తంగా దాదాపు 600 పైచిలుకు హై మాస్ లైట్లు వెలగడం లేదని, పారిశుధ్యం ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. మందిరంలోకి వెళ్లే పడమటి రోడ్డు గుంతలమయంగా మారేందుకు మరమ్మత్తులు చేపట్టలేదని పేర్కొన్నారు. పుట్టపర్తికి ఎంతో ప్రతిష్టాకమైన స్వామి వారి జయంతి వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరిగేలా చర్యలు తప్పవని, పుట్టపర్తి పేరుకు మచ్చ తెచ్చే విదంగా ఉండకూడదని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి ట్రస్టు వారు ఎంత ఘనమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రభుత్వపరంగా రోడ్లు, తాగునీరు, పారిశుద్యం, అదనపు బస్సులు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-----------------------
Admin