సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పాత కొత్తగూడెం అక్రమంగా ఆక్రమించుకున్న స్థలంలో కె.వి రంగా కిరణ్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెం లో దాదాపుగా రెండు నుంచి నాలుగు కోట్ల విలువచేసే రెండు వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని స్థానిక మున్సిపాలిటీలోని కీలక వ్యక్తులు ఆక్రమించుకున్నారు. పేదల ఇంటి స్థలాల గురించి గతంలో చదును చేసిన 30 ఎకరాల స్థలానికి చుట్టూ ప్రహరీ నీ నిర్మించారు. ఎవరు గుర్తుపట్టకుండా స్థానిక కౌన్సిలర్లు ఎవరు గుర్తుపట్టకుండా ప్రస్తుతం ఉన్న ప్రహరీ మాదిరిగానే మరో ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయంపై స్థానికులు ఎమ్మార్వో కి కంప్లైంట్ ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి ఆ ప్రహరీ నిర్మాణాన్ని ఎమ్మార్వో మరియు సిబ్బంది తొలగించారు ఈ స్థలాన్ని ప్రభుత్వo స్వాధీనం చేసుకొని పేదలకు పంచవలసిందిగా అలాగే కబ్జాకు ఎవరైతే పాల్పడ్డారో వారిపై పీ డి ఆక్ట్, ల్యాండ్ గ్యాంబ్లింగ్, కేసులు పోలీసులు నమోదు చేయాలి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో గల 2000 గజాలు కబ్జాకు గురైన అధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తుండడం దురదృష్టకరం ఈ స్థలాన్ని పేదలకు అందించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండలాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాస్ పాల్గొన్నారు
-----------------------
Admin