Friday, 08 May 2026 11:37:12 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు...

Date : 26 January 2023 12:14 AM Views : 650

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వి. ఎం. బంజారలో, విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు.... పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది వార్షిక పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ పేరుతో విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా బుధవారం పెనుబల్లి మండలం వి. ఎం బంజర లోని లక్ష్య టాలెంట్ స్కూల్లో బీజేపీ మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మానసిక వికాసం, ఉత్సాహంతో ఉల్లాసంగా పరీక్షలకు సిద్ధం కావాలని, ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని, అంతేకాకుండా ఏ విధమైన మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురికాకుండా ప్రతి విద్యార్థి రాబోయే పరీక్షలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపి జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు మాట్లాడుతూ. ప్రధాని మోడీ ప్రతినెలా మాన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దానిలో భాగంగా ఈనెల 27వ తేదీన ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులు పరీక్షలకు ఏ విధంగా తయారవ్వాలి అనే విషయంపై మాట్లాడనున్నారని, స్వయంగా కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పలగాని ఈశ్వర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: