సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధులుగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షత తో అఖండ భారతావానికి విశేష సేవలందిచాడని కొనియాడారు. సమాజంలో అనగారిన వర్గాల సంక్షేమం కోసం, కుల రహిత సమాజం కోసం అలుపెరుగని కృషి చేశారని, దేశంలో సామాజిక న్యాయ సాధన కు ఎంతో కృషి చేసాడని అన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాంగారి రవి, విష్ణువర్ధన్ రెడ్డి, సరికొండ రమేష్, మహేష్ గౌడ్, మురళి, కృష్ణారెడ్డి, నాగరాజ్, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin