సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నిరుపేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాసేవలో వారి ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆయురారోగ్యాలు, ఆనందం, కీర్తి మరింతగా పెరగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ గారి జీవితం ప్రతి ఒక్క కార్యకర్తకి ఆదర్శనీయమని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో వారి కృషి అనన్య సామాన్యమైనదన్నారు.ఒక బీసీ బిడ్డగా పిసిసి అధ్యక్షునిగా రాణిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల పక్షాన అందరికీ సమన్యాయం జరగాలని నిరంతరం తపించే వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని మంత్రి సురేఖ తెలిపారు.
-----------------------
Reporter