సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని మార్కెట్ యార్డు లో నూతనంగా ఏర్పాటు చేయనున్న పశువుల సంత ఏర్పాటు ను స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి జగన్ నాయక్, మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముడెం లింగారెడ్డి, హుజూర్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో జానకి రాములు, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు, పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పశువుల సంతకు కావలసిన సౌకర్యాలను ఆధునీకరణ ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు జగదీష్ రెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి లను కోరారు.అదేవిధంగా, తెలంగాణకు ఆంధ్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో పశువుల సంతకు అనువైన ప్రదేశంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి అంచనా వేయం రెండు కోట్లు అవుతుందని వెంటనే పశువుల సంత ఏర్పాటుకు సహకరించి, నిధులు కేటాయించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సంగయ్య డైరెక్టర్లు భక్షా నాయక్, వెంకటేశ్వర్లు, పిడమర్తి అంజి, ఇతిహాజ్, పెండం వీరయ్య, దస్తగిరి, మండల బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాండు, సురేష్ గౌడ్, సురేష్ గౌడ్ ,రంగా నాయక్ ,బాబు నాయక్ ,నాగరాజు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin