సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్త గూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆటల పోటీల్ని శుక్రవారం ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కోర్టు భవన సముదాయం ప్రాంగణంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదుల గుమస్తాలు కి ఆటల పోటీల్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ , మొదటి అదనపు జిల్లా జడ్జి శ్యాం , ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు , ఫస్ట్ ఎడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ. సుచరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్, ఉపాధ్యక్షులు దుండ్రా రమేష్ ,ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు, జాయింట్ సెక్రెటరీ కాసాని రమేష్, సాంస్కృతిక ఆటల కార్యదర్శి పిట్టల రామారావు, గ్రంథాలయ కార్యదర్శి యాస యుగేందర్, మహిళా ప్రతినిధి మనోరమ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అన్నపూర్ణ , సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది , న్యాయవాదుల గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలు మొదటిగా లెమన్ అండ్ స్పూన్ ఆటని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జండా ఊపి ప్రారంభించారు. తర్వాత మహిళలకి మ్యూజికల్ చైర్ ఆటని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి భానుమతి, ఫస్ట్ ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. సుచరిత ఆటని ఆడి ప్రారంభించారు. తర్వాత క్యారమ్స్ డబుల్స్ ఆటని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ భానుమతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, బారసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ మక్కడ్, ప్రధాన కార్యదర్శి రావిలాలా రామారావు ప్రారంభించారు.
-----------------------
Admin