సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఒక పక్క పండించిన పంటను అమ్ముకోలేక రెైస్ మిల్లుల వద్ద రెైతులు పడిగాపులు కాస్తుంటే మరోపక్క రెైతు ఉత్సవాల పేరిట చెరువుకట్టల పై న దావతులా...? హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉన్న రెైస్ మిల్లులను సందర్శించి రైతు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుండి ఐకెపి సెంటర్ల నుండి పంపించిన ధాన్యాన్ని తడిసి పోయినవని,రంగు మారినవని సాకులు చూపుతూ రెైతుల ధాన్యాన్ని లారీల నుండి దించకుండా ఇబ్బంది పెడుతున్న రెైస్ మిల్లర్లతో మాట్లాడి తక్షణమే ధాన్యాన్ని కొని,సరెైన గిట్టుబాటు ధర కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.సాంబశివగౌడ్ డిమాండ్ చేశారు.ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పేద చిన్నకారు రైతులను ఈ భా.రా.స ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా అరిగోస పెడుతుందని, రైతుల ఉసురు తీసుకుంటున్న ఈ దొరల ప్రభుత్వానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటుతో బుద్ది చెప్పాలని డా.దేశగాని సాంబశివ గౌడ్ పిలుపునిచ్చారు. అదే విధంగా రైతుల సమస్యలు తెలుసుకొని వారికి బహజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈ సి మెంబెర్ కొండా భీమయ్యా గౌడ్, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి,నియోజకవర్గ మహిళా కన్వీనర్ మెండం రమణ మరియు భాధిత రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin