Monday, 14 September 2026 10:06:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓబుల దేవర చెరువు మండలం లో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే...

Date : 08 April 2023 03:01 AM Views : 583

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : క్రీస్తు సిలువ వేయబడిన రోజును స్మరించుకుంటూ ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చిలో గుడ్ ఫ్రైడేను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసు క్రీస్తు సిలువలో చివరిగా పలికిన ఏడు మాటలను ధ్యానించారు. క్రైస్తవులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు సిలువ త్యాగాన్ని స్మరిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. యేసు సిలువలో పలికిన ఏడు మాటలను జయానందం, బాలరాజు, రాజశేఖర్, ఆశీర్వాదమ్మ, రోజ్ మేరీ, మణి, రూబీ బోధించారు. పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఎంజి.జయానందం మాట్లాడుతూ ఆనాడు లోక రక్షణ కోసం యేసు క్రీస్తు సిలువ వేయబడ్డారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు. అందరూ ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దార్ల రాజశేఖర్, సభ్యులు ఎం యు రఘు కుమార్, కె బాలరాజు, టి ఎం రాజకుమారి, సునీల్, ప్రభు కుమార్, సుగుణమ్మ పాల్గొన్నారు.... ఈస్టర్ వేడుకలు క్రీస్తు మరణించి తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించనున్నట్లు మండల కేంద్రంలోని సి అండ్ ఐ జి మిషన్ చర్చి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ ఎంజి.జయానందం, కార్యదర్శి దార్ల రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. చర్చిని పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు పేర్కొన్నారు......

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :