సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ : దిల్షుక్నగర్ భాష్యం స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శర్వాన్, ఫ్రెషర్స్ డే కు ముఖ్యఅతిథిగా జోనల్ ఇంచార్జ్ అంకమ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పల్లవి మాట్లాడుతూ గురువారం రోజున ఫ్రెషర్స్ డే సందర్భంగా భాష్యం స్కూల్లో ఎలక్షన్స్ నిర్వహించి పిల్లల స్కూల్ లేదా స్కూల్ లెవెల్ నుంచే నాయకత్వ లక్షణాలు ఎలా నిర్వహించాలనే దానిపై అవగాహన కల్పించి స్కూల్లో మూడు విభాగాలుగా స్కూల్ పీపుల్ లీడర్, డిప్యూటీ లీడర్, హౌస్ లీడర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్స్ బయట ఎలా జరుగుతాయో అదేవిధంగా నిర్వహించారు. ఈ ఎలక్షన్లలో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin