సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల నుంచి సీపీ ఇకపై అన్ని పనిదినాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అయితే, కమిషనర్ను ఆశ్రయించే లోపే బాధితులు ముందుగా కిందిస్థాయి అధికారుల వద్ద ఫిర్యాదు చేసి ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన విధానాన్ని ప్రజలు గమనించి, ఆయా సమయాల్లో కమిషనరేట్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.
-----------------------
Reporter